Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క ఎకరం కూడా సాగు చేయడానికి వీల్లేదు : సిద్ధిపేట కలెక్టర్

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (12:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట కలెక్టర్ స్థానిక రైతులకు ఓ హెచ్చరిక చేశారు. ముఖ్యంగా, యాసంగిలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో ఒక్కఎకరా వరిసాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ఆదేశించారు. 
 
యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై జిల్లా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, విత్తన డీలర్లలతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహాకారంతో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. 
 
వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ప్రభుత్వ సూచనలకు విరుద్ధంగా వరి సాగు చేస్తే రైతులదే బాధ్యత అని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా రైతులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments