Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లాడతానంటూ వ్యాపారిని బోల్తా కొట్టించిన శ్రుతి: రూ. 11 కోట్లు స్వాహా

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (15:35 IST)
మోసం చేసేది పురుషులే కాదు... స్త్రీలలోనూ వున్నారనేందుకు మరో ఉదాహరణ. పెళ్లి చేసుకుంటానంటూ ఓ బడా వ్యాపారవేత్తను నమ్మించి వంచించి అతడి దగ్గర్నుంచి సుమారు రూ. 11 కోట్ల మేర లాగేసిందా మాయలేడి. తను ఓ ఐపిఎస్ అధికారినని కూడా వ్యాపారిని నమ్మించి నట్టేట ముంచింది. చివరకు బాగోతం బయటపడటంతో కటకటాలపాలైంది.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రుతి సిన్హా అనే మహిళ తను ఓ ఐపిఎస్ అధికారినంటూ వీరారెడ్డి అనే వ్యాపారికి పరిచయం చేసుకుంది. మనిషి హుందాగా వుండటమే కాకుండా, ప్రేమ కూడా వలకబోసింది. దీనితో వీరారెడ్డి ఆమె మాటలు నమ్మేశాడు.
 
అదే అదనుగా వీరారెడ్డి నుంచి తనకు డబ్బు అవసరం వుందని చెబుతూ పలుసార్లు రూ. 11 కోట్లు అతడి నుంచి తీసుకుంది. పెళ్లి మాటెత్తితే మాత్రం తప్పించుకుంటుంది. ఐతే వీరారెడ్డి ఆమెపై దృష్టి సారించి చూడటంతో ఆమె మోసగత్తె అని తేలింది. దీనితో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫేక్ ఐపిఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments