Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను తిరుమలేశుని దయతో బ్రతుకుతున్నా, అందుకే 3 కోట్లతో శంకుచక్రాలు

నేను తిరుమలేశుని దయతో బ్రతుకుతున్నా, అందుకే 3 కోట్లతో శంకుచక్రాలు
, బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (13:05 IST)
ఓం నమో వేంకటేశాయ. ఆ తిరుమల వేంకటేశుని దివ్యమంగళరూపం ఎన్నిసార్లు వీక్షించినా తనివితీరనది. భక్తుల పాలిట కల్పతరువై ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరునికి భక్తులు తమ శక్తికొలది కానుకలు సమర్పించుకుంటూ వుంటారు. బుధవారం తమిళనాడుకు చెందిన తంగదొరై అనే భక్తుడు భారీ కానుక సమర్పించాడు. శ్రీవారికి శంకుచక్రాలను చేయించి సమర్పించాడు.
 
వీటి విలువ సుమారు రూ .2 కోట్లు వుంటుందని అంచనా. 3.5 కిలోల బంగారంతో స్వామి కోసం శంకు, చక్రాలను తయారు చేసినట్లు తంగదొరై వెల్లడించారు. బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఆభరణాలను సమర్పించారు.
webdunia
తంగదొరై గతంలో కూడా శ్రీవారికి బంగారు, వజ్రాల ఆభరణాలను కానుకగా ఇచ్చారు. వాటిలో బంగారు వడ్డాణం, బంగారు చేతులు, హారము ఉన్నాయి. తిరుమల బాలాజీకి ఎప్పుడూ చాలా విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తూనే వుంటారు.
 
భక్తులు బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాలు, భూములను అర్పిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది భక్తులు నగదు రూపంలో భారీ కానుకలు ఇచ్చారు. ఆ విధంగా భక్తులు వివిధ రూపాల్లో వెంకటేశ్వరస్వామికి కానుకలు ఇవ్వడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఐదు రాష్ట్రాల వాసులకు హస్తినలోకి నో ఎంట్రీ..