పెళ్లాడతానంటూ వ్యాపారిని బోల్తా కొట్టించిన శ్రుతి: రూ. 11 కోట్లు స్వాహా

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (15:35 IST)
మోసం చేసేది పురుషులే కాదు... స్త్రీలలోనూ వున్నారనేందుకు మరో ఉదాహరణ. పెళ్లి చేసుకుంటానంటూ ఓ బడా వ్యాపారవేత్తను నమ్మించి వంచించి అతడి దగ్గర్నుంచి సుమారు రూ. 11 కోట్ల మేర లాగేసిందా మాయలేడి. తను ఓ ఐపిఎస్ అధికారినని కూడా వ్యాపారిని నమ్మించి నట్టేట ముంచింది. చివరకు బాగోతం బయటపడటంతో కటకటాలపాలైంది.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రుతి సిన్హా అనే మహిళ తను ఓ ఐపిఎస్ అధికారినంటూ వీరారెడ్డి అనే వ్యాపారికి పరిచయం చేసుకుంది. మనిషి హుందాగా వుండటమే కాకుండా, ప్రేమ కూడా వలకబోసింది. దీనితో వీరారెడ్డి ఆమె మాటలు నమ్మేశాడు.
 
అదే అదనుగా వీరారెడ్డి నుంచి తనకు డబ్బు అవసరం వుందని చెబుతూ పలుసార్లు రూ. 11 కోట్లు అతడి నుంచి తీసుకుంది. పెళ్లి మాటెత్తితే మాత్రం తప్పించుకుంటుంది. ఐతే వీరారెడ్డి ఆమెపై దృష్టి సారించి చూడటంతో ఆమె మోసగత్తె అని తేలింది. దీనితో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫేక్ ఐపిఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments