షర్మిల కొత్త పార్టీపై సరికొత్త ప్రకటన.. అదేంటి?

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (14:18 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. షర్మిల సారథ్యంలో సరికొత్త రాజకీయ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో ఆవిర్భంచనుంది. ఆ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేశారు. ఈ పార్టీ ద్వారా తెలంగాణలో రాజ‌న్న రాజ్యం తీసుకొస్తాన‌ని ఆమె ప్రకటించారు. 
 
అంతేకాకుండా, ఈ కొత్త పార్టీ విధి విధానాల‌పై ఇప్ప‌టికే ఆమె స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ఈ పార్టీ రేపును వచ్చే నెల 8వ తేదీన తండ్రి జయంతి రోజున ప్రకటించనున్నారు. ఇందులోభాగంగా, వైఎస్సార్ తెలంగాణ పార్టీగా త‌మ పార్టీ పేరును ష‌ర్మిల రిజిస్ట్రేష‌న్ చేయించారు. ఈ ప్ర‌క్రియ సోమవారంతో ముగిసిన‌ట్లు అధికారికంగా ప్ర‌కట‌‌న వ‌చ్చింది.
 
ఇదే విషయంపై ఆ పార్టీ స‌మ‌న్వ‌యక‌ర్త రాజ‌గోపాల్ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ... పార్టీ పేరుపై తన‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఎన్నికల‌ సంఘానికి వైఎస్ విజ‌య‌మ్మ లేఖ రాశార‌ని చెప్పారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త నేత‌ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సంద‌ర్భంగా జులై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్న‌ట్లు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు.
 
వైఎస్సార్  సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్లీ తీసుకు వ‌స్తామ‌ని చెప్పుకొచ్చారు. రాజ‌న్న ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్న‌ట్లు చెప్పారు. ఇప్పటి వరకూ పార్టీ పేరుపై ఎటువంటి అభ్యంతరాలు రాలేదని చెప్పారు.
 
కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అధికారికంగా దీనిపై సంబంధిత ప‌త్రాలు త‌మ‌కు అందాక పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు  ప్రకటిస్తామ‌ని చెప్పారు.  పార్టీ ఆవిర్భావానికి అన్ని రకాల ఏర్పాట్లను ఇప్ప‌టికే తాము ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

Virosh Reception: విరోష్ పెళ్లి రిసెప్షన్ పరిమిత ఆహ్వానితులకు మాత్రమే

దుబాయ్‌లో ప్రశాంతంగా వుంది: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ

'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ మూవీ కాదు : దర్శకుడు హరీశ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments