Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు ఒకటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (20:03 IST)
తెలంగాణా రాష్ట్రంలో కూడా బడులు తెరుచుకోనున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు సమాచారం. 
 
విద్యా సంస్థలను ఓపెన్ చేయడంపై సీఎం కేసీఆర్ సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు చర్చలు నిర్వహించిన సీఎం.. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
విద్యాసంస్థలు ప్రారంభించవచ్చని.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ, విద్యా శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విద్యా సంస్థల పునః ప్రారంభం నేపథ్యంలో అందరూ కరోనా నియమ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఈ మేరకు తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో సెప్టెంబర్ ఒకటో తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష క్లాసులు ప్రారంభం కానున్నాయి. కాగా తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టిన సంగతి తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments