Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జనార్ మా మంచి మారాజు అంటోన్న టీఎస్ఆర్టీసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (14:23 IST)
సజ్జనార్... ఏ పదవిలో వున్నా దానికి వన్నె తీసుకురావడం ఆయన స్టైల్. సిపిగా వుండగా నేరగాళ్ల గుండెల్లో దడ పుట్టించిన సజ్జనార్ ప్రస్తుతం టీఎస్ ఆర్టీసికి ఎండిగా వున్నారు. ఆర్టీసి అనగానే చాలామంది ఆ పదవిని తీసుకునేందుకు ఆసక్తి చూపరు. ఐతే సజ్జనార్ దేన్నయినా సవాలుగా తీసుకుని ముందుకు సాగుతుంటారు. టీఎస్ఆర్టీసి ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసిని ఎలాగైనా లాభాల బాట పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు.

 
అదే సమయంలో ఉద్యోగులకు భరోసా కల్పించే ఎన్నో ప్రణాళికలు వేస్తున్నారు. తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నూతన సంవత్సరం సందర్భంగా తీపి కబురు చెప్పారు. దశలవారీగా ఆ ఉద్యోగులందర్ని పర్మినెంట్ చేస్తామని తెలిపారు. దీనితో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంతోషానికి అవధుల్లేవు. సజ్జనార్ మా మంచి మారాజు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

 
ఇకపోతే... నూతన సంవత్సరం సందర్భంగా 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. రాబోయే కాలంలో దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments