Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో రూ.5లకే రుచికరమైన, నాణ్యమైన భోజనం.. ఎవరికంటే?

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (15:59 IST)
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర రోగుల సహాయకుల కోసం 5రూపాయలకే రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని మూడు పూటలా అందించేందుకు తగిన కార్యాచరణను రూపొందించింది. 
 
దీంతో పేద, మధ్యతరగతి రోగుల గురించి ఆలోచించిన ప్రభుత్వం 25రూపాయల ఖర్చు అయ్యే భోజనం ఖరీదులో 19.25 రూపాయల రాయితీని ప్రభుత్వం భరిస్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 38.66కోట్ల అదనపు భారం పడనుంది. 
 
ఆర్ధికంగా వెనుకబడిన, పేదల సౌకర్యం గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ తరహా సదుపాయం కోసం హరే కృష్ణ మూవ్‌మెంట్ స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. పది రోజుల్లో ఈ ఐదు రూపాయల భోజనం సదుపాయం అందుబాటులోకి రానుంది.
 
ఇందులో భాగంగా తొలివిడతగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రధాన ఆసుపత్రుల దగ్గర ఈసౌకర్యం అందుబాటులోకి తెస్తోంది. రోజుకు 55,800 భోజనాలను రోగుల సహాయకులకు అందించేందుకు అంతా సిద్ధం చేసింది . దీని ద్వారా రోజుకు 18,600మందికి లబ్ది చేకూరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments