Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది పవిత్రస్థలం.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడను : చంద్రబాబు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (15:46 IST)
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. అమ్మవారి ఆశీస్సుల తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ఇద్రకీలాద్రి పవిత్ర పుణ్యస్థలం. ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. ఈ రోజు నేను ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు తీసుకునేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. 
 
అంతేకాకుండా, ప్రజల తరపున రాజీలేని పోరాటం చేయడానికి వీలుగా అవసరమైన శక్తిని ప్రసాదించాలని దుర్గమ్మను కోరేందుకు వచ్చాను. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా ప్రజల సంక్షేమం కోసం పోరాడుతుంది. ప్రపంచంలో తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా నన్ను అభిమానిస్తున్నారు. జన్మదినం సందర్భంగా తనకు బర్త్‌డే విషెస్ చెపుతున్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పమే చేస్తానను అని చంద్రబాబు వెల్లడించారు. 
 
రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం తాను చేపట్టిన పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని తెలిపారు. కాగా, చంద్రబాబు వెంట ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలైన బుద్ధా వెంకన్నతో సహా అనేక మంది నేతలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఏపీలోని జిల్లాల్లో చంద్రబాబు త్వరలోనే పర్యటించనున్నారు. ఇదే అంశంపై పార్టీ నేతలతో ఆయన చర్చలు జరుపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments