Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యపేటలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి దుర్మరణం

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (10:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపటలో ఘోరం జరిగింది. అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మునగాల పెట్రోల్ బంకు వద్ద అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సాగర్ ఎడమకాల్వ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో గత రాత్రి మహాపడి పూజ కార్యక్రమాన్ని కొందరు అయ్యప్ప భక్తులు నిర్వహించారు. ఈ పూజను విజయవంతంగా పూర్తి చేశారు. 
 
పూజ ముగించుకుని ట్రాక్టర్ ట్రాలీలో 38 మంది తిరిగి మునగాలకు బయకు బయలుదేరారు. వీరి ట్రాక్టర్ విజయవాడ - హైదరాబాదా జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళుతుండగా, మునగాల శివారు ప్రాంతంలోని పెట్రోల్ పంపు వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది వరకు గాయపడ్డారు. వీరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments