సూర్యపేటలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి దుర్మరణం

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (10:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపటలో ఘోరం జరిగింది. అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మునగాల పెట్రోల్ బంకు వద్ద అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సాగర్ ఎడమకాల్వ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో గత రాత్రి మహాపడి పూజ కార్యక్రమాన్ని కొందరు అయ్యప్ప భక్తులు నిర్వహించారు. ఈ పూజను విజయవంతంగా పూర్తి చేశారు. 
 
పూజ ముగించుకుని ట్రాక్టర్ ట్రాలీలో 38 మంది తిరిగి మునగాలకు బయకు బయలుదేరారు. వీరి ట్రాక్టర్ విజయవాడ - హైదరాబాదా జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళుతుండగా, మునగాల శివారు ప్రాంతంలోని పెట్రోల్ పంపు వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది వరకు గాయపడ్డారు. వీరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments