కామారెడ్డిలో ఘోరం - రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (13:11 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ (ఎం) వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్ ఒకటో డిపోకు చెందిన బస్సు కామారెడ్డి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 
 
బస్సు ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. కారులోని మరో బాలిక తీవ్రంగా గాపయడింది. ఆ బాలికను ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. టైరు పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments