కామారెడ్డిలో ఘోరం - రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (13:11 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ (ఎం) వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్ ఒకటో డిపోకు చెందిన బస్సు కామారెడ్డి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 
 
బస్సు ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. కారులోని మరో బాలిక తీవ్రంగా గాపయడింది. ఆ బాలికను ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. టైరు పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments