Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరు జిల్లాలో దారుణం : లోయలోపడిన బస్సు - ఏడుగురు మృతి

చిత్తూరు జిల్లాలో దారుణం : లోయలోపడిన బస్సు - ఏడుగురు మృతి
, ఆదివారం, 27 మార్చి 2022 (10:12 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. నిశ్చితార్థం కోసం ధర్మవరం నుంచి తిరుచానూరుకు బయలుదేరిన బస్సు ఒకటి లోయలోపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 63 మంది ఉన్నారు. ఈ ప్రమాదం జిల్లాలోని భాకరాపేట ఘాట్‌ రోడ్డు సమీపంలో మూల మలుపు తిరిగే సమయంలో అదుపుతప్పి 60 అడుగుల లోతులో పడిపోయింది. 
 
అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్ర నగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాం నిశ్చియమైంది. దీంతో ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం జరగాల్సివుంది. ఇందుకోసం వేణు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ధర్మవరం నుంచి ఓ ప్రైవేటు బస్సులో మొత్తం 63 మందితో తిరుచానూరుకు బయలుదేరారు. 
 
రాత్రి 8 గంటల సమయంలో పీలేరులోని ఓ డాబా వద్ద ఆగి అందరూ భోజనాలు చేసి తిరిగి బయలుదేరారు. అక్కడ నుంచి సరిగ్గా 9 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత భాకరాపేట ఘాట్ రోడ్డు వస్తుండగా, దొనకోటి గంగమ్మ గుడి దాటిన తర్వాత మూల మలుపు పద్ద బస్సు అదుపు తప్పి 60 అడుగుల లోతోపడిపోయింది. 
 
ఈ ఘటనలో ఘటనా స్థలంలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకొందరి కాళ్లు, చేతులు విరిగాయి. కొందరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు వృద్ధులు కూడా ఉన్నారు. 
 
ఈ ప్రమాదం రాత్రి పది గంటల సమయంలో జరగడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. బాధితుల రోదనలు విన్న కొందరు వాహనదారులు ఆగి లోయలోకి చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లోయలో చిక్కుకునిపోయిన వారిని రక్షించారు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీతాకోక చిలుకల నేపథ్యంతో వేసవి ఆహ్లాదాన్ని తీసుకువచ్చిన ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌