Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ వరి దీక్ష : ఒకే వేదికపై రేవంత్ - కోమటిరెడ్డి

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (14:44 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే చర్యలకు పూనుకుంది. ఇందులోభాగంగా, శనివారం నుంచి వరి దీక్షను చేపట్టింది. ఈ దీక్షను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టారు. ఇక్కడ విశేషమేమిటంటే.. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరిదీక్షకు ఆ పార్టీ నేతలంతా సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా, రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రెండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు రేవంత్, కోమటిరెడ్డి ఇద్దరూ హాజరయ్యారు. ఆ ఇద్దరూ ఆలింగనం చేసుకుని ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొన్నారు. 
 
కాగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్‌లోకి అడుగుపెట్టలేదు. ఆయనపై పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల దారుణ ఓటమిపై కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కోమిటిరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం