రేవంత్‌ను వెంటనే సస్పెండ్ చేయండి.. చంద్రబాబుకు ఎల్ రమణ లేఖ

తెలంగాణ రాష్ట్రంలోని టీడీపీ సీనియర్ నేతల మధ్యవిభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ డిమ

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (14:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని టీడీపీ సీనియర్ నేతల మధ్యవిభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ లేఖ రాశారు. 
 
గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. ముఖ్యంగా గతవారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అదీ కూడా పార్టీ అధినేత చంద్రబాబుకు మాటమాత్రం చెప్పకుండా భేటీ అయ్యారు. 
 
దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో టీ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఇటీవల జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి వ్యవహారంపైనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ అంశాలన్నింటిపైనా ఓ నివేదిక తయారు చేసి రమణ పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు. ఇందులో రేవంత్ వంటి నేత ఇక వద్దని, ఆయనపై వెంటనే వేటు వేయాలని కోరినట్టు తెలుస్తోంది. 
 
రేవంత్ పార్టీ మారడం ఖాయమని, ఈ లోగా సాధ్యమైనంత మేరకు టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని, కాబట్టి ముందే నిర్ణయం తీసుకుందామని కూడా రమణ సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం లండన్‌లో ఉన్న చంద్రబాబు, బుధవారం రాత్రి భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో రేవంత్‌పై నిర్ణయం తీసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments