Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వ్యాప్తంగా మండిపోతున్న ఎండలు.. నిర్మల్‌ జిల్లాలో అత్యధిక టెంపరేచర్

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (11:19 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ముఖ్యంగా, నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ యేడాది రాష్ట్రంలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత ఇదేకావడం గమనార్హం. దీంతో అనేక ప్రాంతాల్లో పగటిపూట నిర్మానుష్యంగా కనిపిస్తుంది. మరో మూడు రోజులు ఇలానే ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు మరీముఖ్యంగా, వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 
 
కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జంబుగ, నల్గొండ జిల్లా కట్టంగూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా ఈ తక్కళ్లపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గోధూరులో 44.3 డిగ్రీలు, సూర్యాపేటలో 44 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణాలోని 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ నెల 19వ తేదీ తర్వా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments