Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. ఉరుములు, మెరుపులు..?

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (20:55 IST)
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే మూడు రోజుల్లో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. 
 
ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. 
 
ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్లు పడనున్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒకచోట.. రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
 
ఇప్పటికే ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ తదితర జిల్లాల్లో వర్షం కురిసింది. అలాగే వికారాబాద్‌ జిల్లా మొయిన్‌పేటలో 31.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments