Webdunia - Bharat's app for daily news and videos

Install App

100కు ఫోన్ చేసిన యువతి .. పెట్రోల్ తెచ్చి పోసిన ఖాకీలు

Webdunia
శనివారం, 30 నవంబరు 2019 (12:06 IST)
హైదరాబాద్ నగరంలోని రాచకొండ పరిధిలో ఓ యువతికి పోలీసులు సహాయం చేశారు. ప్రయాణం మధ్యలో పెట్రోలు అయిపోయిందంటూ ఓ యువతి 100కు డయల్ చేయగా, రాచకొండ పరిధిలోని పోలీసులు క్షణాల్లో స్పందించారు. ఆ యువతి కోరిక మేరకు పెట్రోలు తెచ్చి పోశారు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. రాచకొండ పోలీసులు ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 
 
వరుస అత్యాచార ఘటనలతో ఉలిక్కిపడిన హైదరాబాద్‌లో పోలీసులు ఇప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రాచకొండ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ యువతి డయల్ 100కు కాల్ చేసి బండిలో పెట్రోలు అయిపోయి ఇబ్బంది పడుతున్న విషయం తెలిపింది. 
 
వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోలు బాటిల్‌తో యువతి వద్దకు చేరుకున్నారు. స్కూటీలో వాహనం పోసి జాగ్రత్తలు చెప్పి పంపించారు. రాచకొండ పోలీసులు ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. యువతి ఫోన్‌‌కు స్పందించి సాయం చేసిన పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments