Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుని నిర్లక్ష్యం.. వైద్యం వికటించి నిండు గర్భిణీ మృతి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (12:45 IST)
వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన వరంగల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నర్సంపేటలో వైద్యం వికటించి నిండు గర్భిణి చనిపోయింది. దుగ్గొండి మండలం మధిరకు చెందిన లావణ్య(24)కు నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన రాకేశ్రెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహమైంది. 
 
ప్రస్తుతం లావణ్య నిండు గర్భిణి. శనివారం పురిటి నొప్పులు రావడంతో ఆమె అత్త రేణుక నర్సంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లింది. నొప్పులు రావడం సహజమేనని.. ఏమీ కాదని డాక్టర్ చెప్పారు.
 
ఆదివారం ఉదయం మరోసారి నొప్పులు రావడంతో కాంపౌండర్ ఒక ఇంజక్షన్ ఇచ్చారు. కొన్ని నిమిషాల్లోనే లావణ్య చనిపోయింది. డాక్టర్ నిర్లక్ష్యం, వైద్యం వికటించడంతోనే తమ బిడ్డ మృతి చెందిందని లావణ్య కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.  

సంబంధిత వార్తలు

హరి హర వీర మల్లు పూర్తి చేయడానికి ఏఎం రత్నం టీమ్ చర్చలు

ఐస్ బాత్ చేస్తూ వీడియోను పంచుకున్న చిరుత హీరోయిన్ నేహా శర్మ (video)

ఆకట్టుకుంటోన్న యావరేజ్ స్టూడెంట్ నాని మోషన్ పోస్టర్

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments