Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం.. మెడపై గోళ్లతో రక్కి.. రాక్షసంగా ప్రవర్తించారు..

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (08:09 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమె పట్ల రాక్షసంగా ప్రవర్తించారని మెడికల్‌ రిపోర్టులో వెల్లడైంది. 
 
బాలికను నమ్మించి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన నిందితులు కారులో బాలిక మెడపై గోళ్లతో రక్కి గాయాలు చేసినట్లు మెడికల్ రిపోర్టులో వెల్లడైంది. అంతేకాకుండా బాలిక శరీరంపై పలు చోట్ల కూడా గాయాలున్నాయని రిపోర్టులో డాక్టర్లు పేర్కొన్నారు. 
 
కారులో బాలికపై నిందితులు లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించిన సమయంలో ప్రతిఘటించిందని, దాంతో ఆగ్రహించిన నిందితులు ఇష్టానుసారంగా బాలికపై దాడికి దిగినట్లు ఈ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ప్రస్తుతం పోలీసు కస్టడీ విచారణను ఎదుర్కుంటున్న సాదుద్దీన్‌ కొన్ని సమయాలలో బాలికపై జరిగిన అంశాలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నా ఇంకొన్ని అంశాలపై మౌనంగా ఉంటున్నాడని తెలిసింది. సాదుద్దీన్‌ రెండవ రోజు విచారణ కొనసాగుతుండగా, శనివారం నుంచి ముగ్గురు మైనర్లను విచారించనున్నారు. ఇప్పటికే ఐదుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం