Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (09:06 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దికుతున్న రాజాసింగ్‌పై తెలంగాణ మంగళ్‌‍హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ స్టేషన్ సీఐ ఏ.రవికుమార్‌ తెలిపిన ప్రకారం.. ఈ నెల 14న అఫ్జల్‌గంజ్‌ పరిధిలో జరిగిన భాజపా ఎన్నికల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం లేపాయి. ఎస్ఐ షేక్‌ అస్లాం ఫిర్యాదు మేరకు మంగళ్‌హాట్‌ పోలీసులు ఆయనపై సెక్షన్‌ 153, 153(ఏ) ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. 
 
ఈ కేసు నమోదుపై రాజాసింగ్ స్పందిస్తూ, ఈ నెల 30న జరిగే ఎన్నికలు తనకు రాజకీయంగా జీవన్మరణం లాంటివన్నారు. రాజకీయంగా తనకు శత్రువులు ఎక్కువని, తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలను తరిమికొట్టాల్సిందే అన్నారు. 
 
తనను ఓడించేందుకు గోషామహల్‌లో మాత్రమే కాదని, ప్రపంచంలోని ముస్లిం ప్రముఖులూ ప్రయత్నిస్తున్నారని, అందుకు పెద్దసంఖ్యలో నిధులు సమీకరిస్తున్నారని ఆరోపించారు. తన ఓటమి కోసం శత్రువులతో చేతులు కలిపే శక్తులపై నిఘా ఉంచానని, ఎన్నికల తర్వాత వారి భరతం పడతానన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments