Webdunia - Bharat's app for daily news and videos

Install App

8న హైదరాబాద్ వస్తున్న ప్రధాని.. షెడ్యూల్ ఇదే..

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (09:05 IST)
ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు శంకుస్థాపనలు చేయనున్నారు. మరికొన్ని పూర్తయిన అభివృద్ధి పనులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను తెలంగాణ బీజేపీ శాఖ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
 
8న శనివారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అక్కడ నుంచి మధ్యాహ్నం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వస్తారు. అక్కడ సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య నడిచి వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 
 
12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీ ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments