Webdunia - Bharat's app for daily news and videos

Install App

8న హైదరాబాద్ వస్తున్న ప్రధాని.. షెడ్యూల్ ఇదే..

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (09:05 IST)
ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు శంకుస్థాపనలు చేయనున్నారు. మరికొన్ని పూర్తయిన అభివృద్ధి పనులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను తెలంగాణ బీజేపీ శాఖ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
 
8న శనివారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అక్కడ నుంచి మధ్యాహ్నం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వస్తారు. అక్కడ సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య నడిచి వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 
 
12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీ ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments