Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభం

హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌కు వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సేవలను ప్రారంభించనున్నారు.

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (09:30 IST)
హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌కు వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అంది. 
 
ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా అంటే 3 గంటల 25 నిమిషాలకు మియాపూర్ మెట్రో స్టేషన్ చేరుకొని… మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు 5 కిలోమీటర్లు రైలులో ఆయన ప్రయాణిస్తారు. తిరగి మియాపూర్ చేరుకుని.. అక్కడే ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 
 
మెట్రో ప్రారంభం తర్వాత హెలికాప్టర్‌లో హెచ్ఐసీసీ చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. ఆ తర్వాత ఎనమిదిన్నరకు శంషాబాద్ నుంచి తిరిగి ఢిల్లీ వెళతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments