"చోటా ఆద్మీ బడా కామ్ కరే".. ఈటలకు ప్రధాని మోడీ కితాబు

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (14:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ తరపు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. శభాష్.. ఈటలగారు అంటూ అభినంధించి, ఇక తగ్గకండి.. ఇదే స్ఫూర్తి పట్టుదలతో ముందుకుసాగాలని ఆయన కోరారు. 
 
ప్రధాని మోడీ శనివారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లే సమయంలో విమానాశ్రయంలో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌పై విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ప్రధాని మోడీకి బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ పరిచయం చేశారు. 
 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించారని చెప్పారు. ఈ ప్రకటనలను విన్న తర్వాత, ప్రధాని మోడీ ఈటల రాజేందర్‌ను భుజం తట్టి అభినందించారు. "చోటా ఆద్మీ బడా కామ్ కరే" అంటూ కామెంట్స్ చేశారు. 
 
అనంతరం బండి సంజయ్‌తో మాట్లాడిన మోడీ ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి బయలుదేరారు. ముచ్చింతల్‌లో సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ అంతకుముందు ఇక్రిసాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments