Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చోటా ఆద్మీ బడా కామ్ కరే".. ఈటలకు ప్రధాని మోడీ కితాబు

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (14:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ తరపు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. శభాష్.. ఈటలగారు అంటూ అభినంధించి, ఇక తగ్గకండి.. ఇదే స్ఫూర్తి పట్టుదలతో ముందుకుసాగాలని ఆయన కోరారు. 
 
ప్రధాని మోడీ శనివారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లే సమయంలో విమానాశ్రయంలో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌పై విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ప్రధాని మోడీకి బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ పరిచయం చేశారు. 
 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించారని చెప్పారు. ఈ ప్రకటనలను విన్న తర్వాత, ప్రధాని మోడీ ఈటల రాజేందర్‌ను భుజం తట్టి అభినందించారు. "చోటా ఆద్మీ బడా కామ్ కరే" అంటూ కామెంట్స్ చేశారు. 
 
అనంతరం బండి సంజయ్‌తో మాట్లాడిన మోడీ ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి బయలుదేరారు. ముచ్చింతల్‌లో సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ అంతకుముందు ఇక్రిసాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments