టీఆరెస్ వ్యూహకర్తగా పీకే ?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (09:38 IST)
2023 ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకునే అంశంపై టీఆరెస్ లో చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పీకే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ విజయానికి తోడ్పడిన సంగతి జగద్వితం.

త్వరలో పశ్చిమ బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి వ్యూహకర్తగా ఒప్పందం కుదిరింది.ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ని ఎదుర్కోవడానికి తగిన వ్యూహం అవసరమన్నది టీఆరెస్ నాయకుల ఆలోచన.

అయితే బెంగాల్ లో మమత విజయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలా?లేక ముందే పీకే తో మాట్లాడాలా ? అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ళ సమయం ఉన్నందున ప్రశాంత్ కిశోర్ తో సంప్రదింపులకు ఇది తగిన సమయం కాదని కొందరు టీఆరెస్ నాయకులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తున్నది.

మూడేళ్ళ కాలంలో తెలంగాణ రాజకీయ చిత్రపటంలో పలు కీలక మార్పులు జరగనున్నవి. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని టీఆరెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కోడై కూస్తున్నారు.కాగా వ్యూహకర్త పీకే. సేవల
వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవలసి ఉన్నది. కేసీఆరే గొప్ప వ్యూహ రచనా 
దురంధరుడు కాగా వేరే బయటి వ్యక్తుల అవసరం ఏమిటి అన్న ప్రశ్న కూడా తలెత్తుతున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments