కరీంనగర్ జిల్లాలో దారుణం: యువకుడిపై పెట్రోల్ పోసి..!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:01 IST)
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనలో యువకుడు పూర్తిగా కాలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. 
 
వీడియోలో యువకుడి శరీరం పూర్తిగా కాలిపోయినట్టు కనిపిస్తోంది. చెట్ల పొదల్లో యువకుడిపై దాడి చేసి హతమార్చినట్లు కనిపిస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ రాంచందర్ రావు పరిశీలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే దుండగులు ఎవరా అన్నది ఇంకా తెలియ లేదు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi's Photos: చిరంజీవి ఫొటో లకు నెటిజన్లు ఫిదా - బాబీ సినిమా కోసమే

Jayasudha: రమణి కళ్యాణం సినిమా చూశా,మంచి ఫీల్‌గుడ్ మూవీ : జయసుధ

Nani: నేచురల్ నాని ది పారడైజ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Exhibitors Association: సింగిల్ థియేటర్లు మూతపడుతున్నాయ్ బతికించండి అంటూ ఎగ్జిబిటర్లు ఆవేదన

Aadi Saikumar : శంబాల కాంబినేషన్ లో యగంధర్ ముని నూతన చిత్రం

తర్వాతి కథనం