Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరానికి డబ్బులు ఇచ్చిన పాపానికి.. ప్రాణాలే పోయాయి

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (09:16 IST)
అవసరానికి డబ్బులు ఇచ్చిన పాపానికి... అప్పిచ్చిన వ్యక్తే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ 13 రోజులుగా ఇంటిముందు బైఠాయించిన వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలంలో మెట్‌పల్లికి చెందిన ఒగ్గు కళాకారుడు వీరెల్లి సంపత్‌.... గతంలో సతీశ్‌ అనే వ్యక్తికి 32లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఎంతో బ్రతిమిలాడటంతో తీసుకున్న డబ్బుల్లో కొంత అప్పుడప్పుడు తిరిగ్గి ఇచ్చిన సతీశ్‌, ఇంకా 7లక్షల రూపాయలు సంపత్‌కు ఇవ్వాల్సి ఉంది. డబ్బులివ్వాలని అప్పటికే ఎంతో వేడుకున్న సంపత్‌, చేసేదిలేక డబ్బులు తీసుకున్న సతీశ్‌ ఇంటి ముందు 2 వారాల క్రితం ఆందోళనకు దిగాడు. దీంతో సతీశ్‌ ఇంటికి తాళం వేసుకుని, పరారయ్యాడు.
 
అప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంపత్‌, 13రోజులుగా అక్కడే బైఠాయించటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments