Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరానికి డబ్బులు ఇచ్చిన పాపానికి.. ప్రాణాలే పోయాయి

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (09:16 IST)
అవసరానికి డబ్బులు ఇచ్చిన పాపానికి... అప్పిచ్చిన వ్యక్తే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ 13 రోజులుగా ఇంటిముందు బైఠాయించిన వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలంలో మెట్‌పల్లికి చెందిన ఒగ్గు కళాకారుడు వీరెల్లి సంపత్‌.... గతంలో సతీశ్‌ అనే వ్యక్తికి 32లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఎంతో బ్రతిమిలాడటంతో తీసుకున్న డబ్బుల్లో కొంత అప్పుడప్పుడు తిరిగ్గి ఇచ్చిన సతీశ్‌, ఇంకా 7లక్షల రూపాయలు సంపత్‌కు ఇవ్వాల్సి ఉంది. డబ్బులివ్వాలని అప్పటికే ఎంతో వేడుకున్న సంపత్‌, చేసేదిలేక డబ్బులు తీసుకున్న సతీశ్‌ ఇంటి ముందు 2 వారాల క్రితం ఆందోళనకు దిగాడు. దీంతో సతీశ్‌ ఇంటికి తాళం వేసుకుని, పరారయ్యాడు.
 
అప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంపత్‌, 13రోజులుగా అక్కడే బైఠాయించటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments