Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు చెల్లించి శవాన్ని తీసుకెళ్లండి: కాప్రాలోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (18:56 IST)
కోవిడ్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు డబ్బులు గుంజుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రులైతే రోగి చనిపోయాక కూడా బిల్లు చెల్లిస్తేనే శవాన్ని ఇస్తామని మొండికేస్తున్నాయి. 
 
తాజాగా మేడ్చల్ జిల్లాలోని నాగరం మునిసిపాలిటీలోని రాంపల్లికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు వాసు ఐదు రోజుల క్రితం కరోనావైరస్‌తో బాధపడుతూ కాప్రాలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఐదు రోజులుగా అతడి చికిత్స కోసం లక్షన్నర రూపాయలు చెల్లిస్తూ వచ్చారు. ఐతే అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం నాడు కన్నుమూశాడు.
 
దీనితో మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు ఆసుపత్రికి వచ్చారు. ఐతే మరో రెండు లక్షలు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గం చెప్పింది. చనిపోయిన తర్వాత బిల్లు ఎందుకు కట్టాలంటూ మృతుడి బంధువులు నిలదీశారు. డబ్బు కట్టి తీసుకెళ్లండి, వాగ్వాదం వద్దని వాసు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. దీనితో అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో నిరసనలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments