Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచం మారాలి.. సమాజం మారాలి.. వారంతా బద్ధశత్రువులే : పవన్ కళ్యాణ్

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (17:25 IST)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట స్ఫూర్తే జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని, ఉద్యమ విద్యుత్‌ను తనలో ప్రవహింపజేసిందని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచం మారాలి, సమాజం మారాలని కోరుకుంటామని, కానీ ఎందులోనైనా అడుగుపెడితే తప్ప అనుభవం రాదన్నారు. 
 
జనసేన పార్టీ తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ స్ఫూర్తి తన గుండెల్లో ధైర్యాన్ని నింపిందని అన్నారు. 
 
'గెలుస్తామో, ఓడిపోతామో నాకు తెలియదు. నేను రాజకీయాల్లోకి వస్తుంటే భయపెట్టారు. మార్పు కోసం, బలమైన సామాజిక చైతన్యం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. డబ్బులతో కొనలేని కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తేవాలన్నది నా ఆశయం. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. అయితే అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను' అని అన్నారు. 
 
'కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోయే అంశాలు. రాజకీయాల్లో వాటి ప్రస్తావన ఉండకూడదు. కులాలను రెచ్చగొట్టాలని ఏనాడూ ప్రయత్నించలేదు. ఏపీలో అభివృద్ధి దిగజారిపోయింది. అభివృద్ధి నిరోధకులు ఎవరైనా సరే నాకు బద్ధ శత్రువులే' అని పవన్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments