Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ప్రచారం

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (19:58 IST)
దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ప్రచారంపై దృష్టి సారించాయి. టీఆర్‌ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత తరుపున మంత్రి  హరీష్ ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టారు.
 
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ అగ్ర నాయకులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తరుపున ప్రచారం చేయడానికి పార్టీ జాతీయ నాయకులు రానున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా తయారైంది.
 
ఇక జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో దుబ్బాకలో ప్రచారానికి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాలని తెలంగాణా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. నవంబర్ 3వ తేదీన దుబ్బాకలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్టోబరు చివరి వారంలో పవన్‌ను ప్రచారానికి పిలవాలని ప్రయత్నాలు చేస్తునట్టు సమాచారం. దీనికి జనసేన పార్టీ వర్గాలు సానుకూలంగా స్పందించాయి.
 
అయితే ఇప్పటివరకూ పవన్ పాలక టీఆర్ ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. మరి పవన్  ప్రచార తీరు ఎలా ఉంటుంది. ఏయే అంశాలు పవన్ ప్రస్తావిస్తారు అనే అంశం సర్వత్రా ఆశక్తి కనబరుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments