Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నవంబరు 2 నుంచి ఒంటిపూట బడి

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (19:53 IST)
ఏపీ సీఎం జగన్ పాఠశాలల పునఃప్రారంభంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబరు 2 నుంచి స్కూళ్లు తెరవాలని ఇప్పటికే ప్రకటించగా, అందుకు సంబంధించిన విధివిధానాలను సీఎం జగన్ ఖరారు చేశారు.
 
రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్టు సీఎం వెల్లడించారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజున, 2, 4, 6, 8 తరగతులు మరో రోజున నిర్వహిస్తామని తెలిపారు.

విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు జరుపుతామని అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నవంబరులో ఒకపూటే తరగతులు ఉంటాయని సీఎం వెల్లడించారు.

ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు ఇష్టపడకపోతే వారికోసం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తారని తెలిపారు.
 
అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపుతామని వివరించారు. పాఠశాలల వేళలపై డిసెంబరులో పరిస్థితిని మరోసారి సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments