Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గేదెపై ఎక్కి ఎన్నికల ప్రచారం చేసిన అభ్యర్థి, జంతు క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు

Advertiesment
Bihar Elections
, సోమవారం, 19 అక్టోబరు 2020 (21:19 IST)
బీహార్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా ఓ గేదెపై ఎక్కి వీధుల్లో తిరుగుతూ ఓ అభ్యర్థి ప్రచారం చేశాడు. ఇలా ప్రచారం చేస్తున్న అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గయా పట్టణంలో రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరి తన ప్రచార పర్వంలో భాగంగా గేదెపై తిరిగారు.
 
గేదెపై ఎక్కిన అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ పైన జంతు క్రూరత్వ నిరోధక చట్టం, కోవిడ్ 19 మార్గదర్శకాల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. అభ్యర్థి పర్వేజ్ గాంధీ మైదానం నుంచి స్వరాజ్‌పూర్ రోడ్డుకు చేరిన వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పర్వేజ్ పైన ఐపీసీ సెక్షన్ 269, 270 కింద పోలీసులు కేసు నమోద చేశారు.
 
తనను గయా అసెంబ్లీ ఎన్నికలో గెలిపిస్తే పట్టణాన్ని కాలుష్యరహితంగా మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారానికి జంతువులను ఉపయోగించరాదని ఎన్నికల కమిషన్ సూచించిందనీ, దీన్ని ఉల్లంఘించిన పర్వేజ్ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌ల్ప‌వృక్ష వాహనంపై గోకుల నందనుడు