షీ టీమ్స్‌కి చెప్పిందని కసి... యువతిని నడిరోడ్డుపై నరికిన ప్రేమోన్మాది...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:15 IST)
మహిళలపై దాడుల పరంపర సాగుతూనే ఉంది. ఓ కాలేజీ విద్యార్థినిపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో నడిరోడ్డులో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ప్రేమోన్మాదిగా మారిన ఒక యువకుడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది.
 
వివరాలలోకి వెళ్తే, కాచిగూడ పరిధిలోని సత్యనగర్‌లో ఉంటున్న మధులిక స్థానికంగా ప్రైవేటు కాలేజీలో చదువుకుంటోంది. ఎదురింట్లో ఉండే భరత్ ప్రేమించాల్సిందిగా ఆమె వెంటపడేవాడు. మధులిక అతని గురించి తల్లిడండ్రులకు చెప్పగా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసారు. తర్వాత వారు కౌన్సెలింగ్ ఇచ్చిన కూడా అతనిలో మార్పు రాలేదు. తనపై ఫిర్యాదు చేసారన్న అక్కసుతో మరింత రెచ్చిపోయాడు.
 
ఈ రోజు ఉదయం కాలేజీకి వెళ్తున్న మధులికను ఫాలో అయ్యి, తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసాడు. దాడిలో ఆమెకు మెడపై తీవ్రంగా గాయమై రక్తస్రావమైంది, నాలుగు వేళ్లు కూడా తెగిపోయాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments