Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (20:06 IST)
హైదరాబాద్ నగరంలోని క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీన అర్థరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా మెట్రో రైల్ సర్వీసులను అర్థరాత్రి వరకు నడపాలని నిర్ణయించింది. 
 
రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 10 గంటలు దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో సిటీ బస్సులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో మెట్రో రైల్ సర్వీసులు నడపాలని హెచ్ఎంఆర్‌సీ నిర్ణయించింది. ఈ రైళ్లను కూడా క్రికెట్ అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెంచే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments