తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (12:11 IST)
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా ఆయన జాగరణ దీక్షను తలపెట్టారు. దీనికి రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 
 
పైగా, ఆయన తన నివాసంలోనే ఈ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన నివాసంలోనే దీక్షకు దిగగా, దీన్ని పోలీసులు భగ్నం చేశారు. అదేసమయంలో ఆయన్ను అరెస్టు చేసే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టు వదలకుండా ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అరెస్టు చేశారు. 
 
ఒకవైపు కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ అనుమతి లేకున్నప్పటికీ దీక్ష చేయడానికి పూనుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అందుకే ఆయనపై నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments