Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బడులు లేవు.. కారణం అదే..?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (12:03 IST)
కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను తెరిచే విషయంలో తెలంగాణ విద్యాశాఖ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరం(2020-21)లో 1 నుంచి 5 తరగతులకు బడులు తెరవకూడదని నిర్ణయించింది. పాఠశాలలు తెరిచినా.. పిల్లలను తల్లిదండ్రులు సూళ్లకు పంపించేందుకు అంగీకరించకపోవచ్చునని భావిస్తోండడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పవచ్చు.
 
ఒక వేళ పాఠశాలలను తెరిచినా కూడా పిల్లలు భౌతిక దూరం పాటించడం అసాధ్యం, ఒకవేళ పిల్లలు ఈ వైరస్ బారిన పడితే.. ఇంట్లోని పెద్దలకు, వృద్దులకు ప్రమాదం ఉండొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే 5వ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం తరగతి గది భోదన వద్దని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో 11.36 లక్షల మంది ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంఖ్య 15 లక్షల వరకు ఉందని అంచనా. ఇక, నర్సరీ-యూకేజీ మధ్య చదువుతున్న వారు ఆరేడు లక్షల మంది వరకు ఉంటారు. వీరందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. 
 
ఆరు నుంచి 8 తరగతులకు పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకుంటారు. 9-10 తరగతుల విద్యార్థులకు మాత్రం కనీసం 90 రోజులు, గరిష్ఠంగా 120 రోజులపాటు ప్రత్యక్ష బోధన అందించాలని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments