Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత గులాబీ కారెక్కారు..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (14:53 IST)
ఎంపీ కవిత కారెక్కారు... ఇందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా... కారెక్కడమంటే ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు కాదు. నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా నామిషన్ వేసే కార్యక్రమంలో భాగంగా ఆమె కారును నడిపారు. గులాబి రంగు అంబాసిడర్ కారు డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత గాని అక్కడి ఉన్న నాయకులకు అర్థం కాలేదు.. కవిత గారు కారు నడపబోతున్నారని. 
 
గణేష్ అన్నా కారెక్కండి అనగానే గణేష్ గుప్తా ముందు సీట్లో కూర్చున్నారు. ఇంకేముంది బిగాలా ఇంటి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు గేర్ల మీద గేర్లు మార్చుకుంటూ కారు వేగం పెంచారు. వాహనదారులు సైతం ఎంపి కవిత డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందుకు మొబైల్ ఫోన్లను పట్టుకున్నారు. 
 
మీడియా ప్రత్యేక వాహనంలో ఎంపీ కవితను ఫాలో అయ్యారు. మొత్తానికి నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ అభ్యర్థిగా బీగాల గణేష్ గుప్తా చేత నామినేషన్ వేయించేందుకు కారులో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు ఎంపీ కవిత స్వయంగా తీసుకుని వెళ్ళడం పట్ల టీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమైంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments