Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన ఎన్జీటీ.. రూ.900 కోట్ల జరిమానా

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (19:15 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దిమ్మతిరిగేలా షాకిచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ పరిక్షణ అనుమతులు పొందలేదని పేర్కొంటూ రూ.900 కోట్ల మేరకు అపరాధం విధించింది. ముఖ్యంగా, డిండి, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతు లేకుండానే నిర్మిస్తున్నారంటూ ఎన్జీటీ మండిపడింది.
 
పైగా, ఈ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం నిర్మాణ వ్యయంతో 1.5 శాతం అంటే రూ.900 కోట్ల మేరకు అపరాధం విధిస్తున్నట్టు ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పును వెలువరించింది. 
 
ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టారంటూ కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించింది. గతంలో పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని ఎన్జీటీ బెంచ్ ప్రస్తావించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments