తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన ఎన్జీటీ.. రూ.900 కోట్ల జరిమానా

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (19:15 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దిమ్మతిరిగేలా షాకిచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ పరిక్షణ అనుమతులు పొందలేదని పేర్కొంటూ రూ.900 కోట్ల మేరకు అపరాధం విధించింది. ముఖ్యంగా, డిండి, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతు లేకుండానే నిర్మిస్తున్నారంటూ ఎన్జీటీ మండిపడింది.
 
పైగా, ఈ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం నిర్మాణ వ్యయంతో 1.5 శాతం అంటే రూ.900 కోట్ల మేరకు అపరాధం విధిస్తున్నట్టు ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పును వెలువరించింది. 
 
ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టారంటూ కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించింది. గతంలో పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని ఎన్జీటీ బెంచ్ ప్రస్తావించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments