Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో ఆటోలో వెళ్తున్న నవవధువును ఎత్తుకెళ్లారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (10:04 IST)
తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం నవ వధువును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మహిళ భర్తపై దాడి చేసి తీసుకెళ్లారు. ఈ సంఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది.
 
ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న నవీన్ అలియాస్ సన్నీ, మాధవి ఆటో రిక్షాలో వెళ్తుండగా కారులో కొందరు దుండగులు నవీన్‌ను కొట్టి మాధవిని కారులో తీసుకెళ్లారు. కులాంతర వివాహం కావడంతో వివాహాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు తన భార్యను కిడ్నాప్ చేశారని నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
ఎంబీఏ చేస్తున్న మాధవి ప్రాజెక్ట్ వర్క్ కోసం తన భర్తతో కలిసి కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్న భోజనానికి ఆటో రిక్షాలో వెళ్తుండగా కిడ్నాపర్లు అడ్డంగా దొరికిపోయారు. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని నవీన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments