Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై శివారులో పూర్తిగా దగ్ధమైన ఆత్మకూరు ఆర్టీసీ డిపో బస్సు

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (09:52 IST)
చెన్నై నగర శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్ వద్ద గురువారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై నుంచి ఆత్మకూరుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చెన్నై మాధవరం బస్టాండు నుంచి గురువారం బయలుదేరింది. బస్సులో 47 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. ఈ బస్సు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్‌హిల్స్ వద్ద వెళుతుండగా, బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేసి, అందులోని ప్రయాణికులను కిందకు దించేశాడు. 
 
ఇంజిన్ నుంచి మటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేసుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతలో మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments