Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై శివారులో పూర్తిగా దగ్ధమైన ఆత్మకూరు ఆర్టీసీ డిపో బస్సు

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (09:52 IST)
చెన్నై నగర శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్ వద్ద గురువారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై నుంచి ఆత్మకూరుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చెన్నై మాధవరం బస్టాండు నుంచి గురువారం బయలుదేరింది. బస్సులో 47 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. ఈ బస్సు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్‌హిల్స్ వద్ద వెళుతుండగా, బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేసి, అందులోని ప్రయాణికులను కిందకు దించేశాడు. 
 
ఇంజిన్ నుంచి మటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేసుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతలో మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments