Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై శివారులో పూర్తిగా దగ్ధమైన ఆత్మకూరు ఆర్టీసీ డిపో బస్సు

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (09:52 IST)
చెన్నై నగర శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్ వద్ద గురువారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై నుంచి ఆత్మకూరుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చెన్నై మాధవరం బస్టాండు నుంచి గురువారం బయలుదేరింది. బస్సులో 47 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. ఈ బస్సు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్‌హిల్స్ వద్ద వెళుతుండగా, బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేసి, అందులోని ప్రయాణికులను కిందకు దించేశాడు. 
 
ఇంజిన్ నుంచి మటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేసుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతలో మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments