Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయిని మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు: కేసీఆర్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (09:34 IST)
కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి ఇక లేరు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం రాత్రి 12:25కు తుది శ్వాస విడిచారు. నాయిని మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని ముఖ్య మంత్రి కెసిఆర్ తన సంతాపం ప్రకటించారు.
 
ఐదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మిక నేతగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అనన్యసామాన్యమని పలువురు మంత్రులు కొనియాడారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయిన నాయిని వైయస్ కేబినెట్లో మంత్రిగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కార్మిక సంఘ నాయకుడిగా నాయిని నర్సింహారెడ్డి అందరికి సుపరిచితులు.
 
నల్గొండ జిల్లాకు చెందిన నాయిని 1960వ దశకంలో హైదరాబాద్ వచ్చి కార్మికుల హక్కుల పోరాటంతో కార్మిక నాయకుడిగా ఎదిగారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా 1985, 2004లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా, 2009లో తెలంగాణా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments