Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయిని మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు: కేసీఆర్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (09:34 IST)
కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి ఇక లేరు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం రాత్రి 12:25కు తుది శ్వాస విడిచారు. నాయిని మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని ముఖ్య మంత్రి కెసిఆర్ తన సంతాపం ప్రకటించారు.
 
ఐదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మిక నేతగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అనన్యసామాన్యమని పలువురు మంత్రులు కొనియాడారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయిన నాయిని వైయస్ కేబినెట్లో మంత్రిగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కార్మిక సంఘ నాయకుడిగా నాయిని నర్సింహారెడ్డి అందరికి సుపరిచితులు.
 
నల్గొండ జిల్లాకు చెందిన నాయిని 1960వ దశకంలో హైదరాబాద్ వచ్చి కార్మికుల హక్కుల పోరాటంతో కార్మిక నాయకుడిగా ఎదిగారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా 1985, 2004లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా, 2009లో తెలంగాణా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments