Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా తీసుకున్న వలంటీరు మృతి... ఎక్కడ?

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (08:46 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగు కనిపెట్టే పనిలో అనేక దేశాలు నిమగ్నమైవున్నాయి. భారత్‌తో పాటు చైనా, అమెరికా, రష్యాన్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇజ్రాయేల్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ టీకాల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాయి. అయితే, బ్రెజల్‌ జరుగుతున్న టీకా ప్రయోగాల్లో ఓ అపశృతి చోటుచేసుకుంది. టీకా తీసుకున్న వలంటీరు ప్రాణాలు కోల్పోయాడు. ఈ టీకాను ఆస్ట్రాజెనెకా బయోఫార్మా కంపెనీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటితో కలిసి అభివృద్ధి చేస్తోంది. ఈ టీకా తీసుకున్న వలంటీరు ప్రాణాలు కోల్పోయినట్టు బ్రెజిల్ కూడా అధికారికంగా నిర్ధారించింది. 
 
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా కరోనా టీకాను అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ టీకాను పరీక్షిస్తున్నారు. మొదటి, రెండోదశ ప్రయోగాల్లో భాగంగా ఇటీవల బ్రిటన్‌లో ఈ టీకాను తీసుకున్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ఇటీవలే మళ్లీ ఈ ప్రయోగాలను ప్రారంభించారు. మూడో దశలో ఈ టీకాను వేయించుకున్న ఓ వలంటీర్ మృతి చెందినట్టు బ్రెజిల్ ఆరోగ్య విభాగం నిన్న వెల్లడించింది. అయితే, అతడు వ్యాక్సిన్ కారణంగా మరణించాడా? లేక, మరే కారణమైనా ఉందా? అన్న విషయాన్ని వెల్లడించని అధికారులు, పరీక్షలు మాత్రం కొనసాగుతాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments