జనగామ సమ్మక్క ఆలయంలో నరబలి...

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (07:49 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో నరబలి జరిగినట్టు వచ్చిన వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎవరో క్షుద్రపూజలు చేసి ఇక్కడ నరబలి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నరబలి స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
జనగామ జిల్లాలోని చిలుపూరు మండలంలోని గార్లగడ్డ తండా సమీపంలో సమ్మక్క-సారలమ్మ గద్దె ఉంది. ఇక్కడ బుధవారం ఉదయం రక్తపు మరకలు కనిపించాయి. దీంతో స్థానిక తండావాసులు ఆ పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించగా వారికి సమ్మక్క-సారలమ్మ గద్దకు సమీపంలో ఉన్న మల్లన్నగండి రిజర్వాయరులో ఓ మృతదేహం కనిపించింది. దీంతో తండావాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు, జాగిలాలతో రిజర్వాయర్ వద్దకు చేరుకుని తనిఖీ చేశారు. అలాగే, సమ్మక్క ఆలయం వద్ద ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని వయసు 45 వరకు ఉంటుందని తెలిపారు. 
 
మంగళవారం రాత్రి గద్దెల వద్ద అతడిని హత్యచేసి అనంతరం మృతదేహాన్ని రిజర్వాయర్‌లో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల లభించలేదని, దాని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన తీరును బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా నరబలే అయి ఉంటుందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments