Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనగామ సమ్మక్క ఆలయంలో నరబలి...

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (07:49 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో నరబలి జరిగినట్టు వచ్చిన వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎవరో క్షుద్రపూజలు చేసి ఇక్కడ నరబలి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నరబలి స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
జనగామ జిల్లాలోని చిలుపూరు మండలంలోని గార్లగడ్డ తండా సమీపంలో సమ్మక్క-సారలమ్మ గద్దె ఉంది. ఇక్కడ బుధవారం ఉదయం రక్తపు మరకలు కనిపించాయి. దీంతో స్థానిక తండావాసులు ఆ పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించగా వారికి సమ్మక్క-సారలమ్మ గద్దకు సమీపంలో ఉన్న మల్లన్నగండి రిజర్వాయరులో ఓ మృతదేహం కనిపించింది. దీంతో తండావాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు, జాగిలాలతో రిజర్వాయర్ వద్దకు చేరుకుని తనిఖీ చేశారు. అలాగే, సమ్మక్క ఆలయం వద్ద ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని వయసు 45 వరకు ఉంటుందని తెలిపారు. 
 
మంగళవారం రాత్రి గద్దెల వద్ద అతడిని హత్యచేసి అనంతరం మృతదేహాన్ని రిజర్వాయర్‌లో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల లభించలేదని, దాని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన తీరును బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా నరబలే అయి ఉంటుందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments