Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వేయకుంటే జీతం కట్... ఎవరికి?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (07:38 IST)
టెక్కీలకు ఐటీ కంపెనీలు తేరుకోలేని షాకిచ్చింది. ఓటు హక్కును వినియోగించుకోని పక్షంలో ఒక రోజు వేతనం కట్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ తరహా వార్నింగ్ కర్ణాటక రాష్ట్రంలోని అన్ని ఐటీ కంపెనీలు జారీచేశాయి. 
 
ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును ఆ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, ఐటీ కంపెనీలు మాత్రం ఈ ఆదేశాలను బేఖాతర్ చేసి కొన్ని షరతులు కూడా విధించాయి. ఓటు వేసినట్టు ఖచ్చితంగా ఆధారం చూపించాల్సిందేనని, హెచ్‌ఆర్ విభాగంలో ఓటు వేసినట్టు రుజువు చూపిస్తేనే ఆ రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరవుతుందని, లేదంటే వేతనంలో కోత తప్పదని హెచ్చరించాయి.
 
కంపెనీల హెచ్చరికలతో ఉద్యోగులు తలలుపట్టుకుంటున్నారు. గురువారం పోలింగ్ సెలవు, రెండు వీకెండ్ హాలిడేస్ కలుపుకుంటే వరుసగా మూడు రోజులపాటు సెలవులు ఎంజాయ్ చేయాలనుకున్న ఉద్యోగులు కంపెనీల ఉత్తర్వులతో షాక్‌కు గురయ్యారు. 
 
ఇక, ఐటీ సంస్థలు హెచ్చరికలు నిజమైన ఉద్యోగులు అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే బెంగళూరులో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 10 లక్షల ఓట్లు అధికంగా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేసేందుకు సహకరించాలంటూ ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments