Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదగిరిగుట్టకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (19:43 IST)
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి. రమణ మొన్నటికి మొన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ నెల 14న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వస్తున్నారు.

గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ తదితరులు ప్రధాన న్యాయమూర్తి వెంట రానున్నారు. ఘన స్వాగతం పలికేందుకు చేయాల్సిన ఏర్పాట్ల పై సమీక్షించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, వైటీడీఏ అధికారులు ఉన్నారు. 
 
స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం నిర్మాణం పూర్తయిన ఈవో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తొలిసారిగా సీజేఐ యాదాద్రి సందర్శన సందర్భంగా శనివారం జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, సీఎంవో ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి తదితరులు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments