Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,952 కేసులు.. చిత్తూరులోనే అత్యధికం

Advertiesment
Andhra pradesh
, శనివారం, 12 జూన్ 2021 (18:21 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేణా దిగివస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,08,616 కరోనా పరీక్షలు నిర్వహించగా... 6,952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,199 కొత్త కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 1,167 కేసులు గుర్తించారు. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 228 కొత్త కేసులు నమోదయ్యాయి.
 
అదే సమయంలో 11,577 మంది కరోనా నుంచి కోలుకోగా, 58 మరణాలు సంభవించాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో 9 మంది చనిపోయారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 18,03,074 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 16,99,775 మంది కోలుకున్నారు. ఇంకా 91,417 మందికి కరోనా చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 11,882కి చేరింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,08, 616 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం ఎంపిక వ్యవహారంలో గందరగోళం