Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు కరోనా తీవ్రత.. కొత్తగా 15,759 వైరస్ కేసులు

Advertiesment
Tamil Nadu
తమిళనాడులో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 15,759 వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 378 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆ తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,24,597కు, మొత్తం మరణాల సంఖ్య 28,906కు చేరింది.

ప్రస్తుతం 1,74,802 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరితో సహా 11 జిల్లాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతుంది. 
 
మరోవైపు తమిళనాడులో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈనెల 21 వరకూ పొడిగించారు. అయితే లాక్‌డౌన్ ఆంక్షల‌ను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపుల‌కు అనుమతిస్తారు.

చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను ఎయిర్ కండిషన్లు లేకుండా 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటలకు వరకూ అనుతిస్తామని ప్ర‌భుత్వం పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మతం కంటే మానవత్వం గొప్పది: నారా భువనేశ్వరి