Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ నడిపేటపుడు నా కుమారుడు హెల్మెట్ ధరించి వుంటే..: కొడుకు శవం పక్కనే హెల్మెట్‌తో తండ్రి

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (10:03 IST)
జిల్లాలోని పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో తన కుమారుడి అంత్యక్రియల సందర్భంగా హెల్మెట్‌ వినియోగంపై ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కదిలించింది. ఖమ్మం బస్టాండ్ సమీపంలో జనవరి 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్ గ్రామం వద్ద సోమ్లానాయక్ తండాకు చెందిన 18 ఏళ్ల తేజావత్ సాయి తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

 
అంతిమ యాత్రలో ఉన్న యువకుడి తండ్రి తేజావత్ హరి తన కుమారుడి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు. అంతటి బాధలోనూ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడంపై యువతలో సందేశం పంపాలని నిశ్చయించుకున్నాడు. కుమారుడి శవం పక్కనే నిలబడి చేతిలో హెల్మెట్ పట్టుకున్న హరి, ఆ రోజు ఈ హెల్మెట్ ధరించి ఉంటే తన కొడుకు సాయి బతికి ఉండేవాడని రోదిస్తూ చెప్పాడు.

 
“నాలాగా ఏ బిడ్డను ఇలా కోల్పోకూడదు. బైక్ నడిపేటప్పుడు అందరూ హెల్మెట్ ధరించాలి”. కొడుకు మృతి చెందాడన్న బాధలో కూడా ఇలాంటి సందేశం చెప్పి, హెల్మెట్ ధరించాలని హరి చెప్పడాన్ని స్థానికులు కొనియాడారు. ఈ ఘటనను నెటిజన్లు విస్తృతంగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం
Show comments