Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ నడిపేటపుడు నా కుమారుడు హెల్మెట్ ధరించి వుంటే..: కొడుకు శవం పక్కనే హెల్మెట్‌తో తండ్రి

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (10:03 IST)
జిల్లాలోని పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో తన కుమారుడి అంత్యక్రియల సందర్భంగా హెల్మెట్‌ వినియోగంపై ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కదిలించింది. ఖమ్మం బస్టాండ్ సమీపంలో జనవరి 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్ గ్రామం వద్ద సోమ్లానాయక్ తండాకు చెందిన 18 ఏళ్ల తేజావత్ సాయి తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

 
అంతిమ యాత్రలో ఉన్న యువకుడి తండ్రి తేజావత్ హరి తన కుమారుడి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు. అంతటి బాధలోనూ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడంపై యువతలో సందేశం పంపాలని నిశ్చయించుకున్నాడు. కుమారుడి శవం పక్కనే నిలబడి చేతిలో హెల్మెట్ పట్టుకున్న హరి, ఆ రోజు ఈ హెల్మెట్ ధరించి ఉంటే తన కొడుకు సాయి బతికి ఉండేవాడని రోదిస్తూ చెప్పాడు.

 
“నాలాగా ఏ బిడ్డను ఇలా కోల్పోకూడదు. బైక్ నడిపేటప్పుడు అందరూ హెల్మెట్ ధరించాలి”. కొడుకు మృతి చెందాడన్న బాధలో కూడా ఇలాంటి సందేశం చెప్పి, హెల్మెట్ ధరించాలని హరి చెప్పడాన్ని స్థానికులు కొనియాడారు. ఈ ఘటనను నెటిజన్లు విస్తృతంగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments