Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన.. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలి..?

Minister
Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (18:50 IST)
mallareddy
హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు రాజుని ఎన్‌కౌంటర్ చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు.

తెలంగాణలో సంచలనం రేపుతున్న ఆరేళ్ల చిన్నారి హత్యాచారం ఘటనపై మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ... చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. నిందితుడిని పట్టుకుని కచ్చితంగా ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు. త్వరలోనే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తామన్నారు.
 
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిందితుడి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు.

కాగా, గతంలో దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఘటనలోనూ నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తామంటూ మంత్రి మల్లారెడ్డి స్టేట్మెమెంట్ ఇవ్వడం చర్చనీయంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments