Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు : మంత్రి కేటీఆర్

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (16:47 IST)
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ పంజాగుట్ట కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. ఆయనతో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. 
 
అంబేద్కర్ చెప్పినట్టుగానే నడుచుకుంటున్నామని, ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుంతూ ముందుకు సాగుతున్నామని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నేత, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఆయనకే సాధ్యమైందన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు సాహసోపేతమైన పథకం అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. 
 
కొత్త పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన కేంద్ర పాలకులను డిమాండ్ చేశారు. పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడతామని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments