Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు : మంత్రి కేటీఆర్

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (16:47 IST)
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ పంజాగుట్ట కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. ఆయనతో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. 
 
అంబేద్కర్ చెప్పినట్టుగానే నడుచుకుంటున్నామని, ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుంతూ ముందుకు సాగుతున్నామని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నేత, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఆయనకే సాధ్యమైందన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు సాహసోపేతమైన పథకం అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. 
 
కొత్త పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన కేంద్ర పాలకులను డిమాండ్ చేశారు. పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడతామని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments