Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు : మంత్రి కేటీఆర్

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (16:47 IST)
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ పంజాగుట్ట కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. ఆయనతో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. 
 
అంబేద్కర్ చెప్పినట్టుగానే నడుచుకుంటున్నామని, ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుంతూ ముందుకు సాగుతున్నామని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నేత, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఆయనకే సాధ్యమైందన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు సాహసోపేతమైన పథకం అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. 
 
కొత్త పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన కేంద్ర పాలకులను డిమాండ్ చేశారు. పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడతామని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments