Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఫోక్‌ సింగర్‌ గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (09:27 IST)
Sai Chand
తెలంగాణ ఫోక్‌ సింగర్‌, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ సాయిచంద్‌ కన్నుమూశారు. గుండెపోటుతో అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు. కారుకొండలో తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సాయిచంద్ అక్కడే గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన నాగర్‌కర్నూల్ గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. 
 
అప్పటికే సాయిచంద్‌ చనిపోయినట్లు కేర్‌ వైద్యులు ప్రకటించారు. మంత్రి హరీష్ రావు, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా ఇతర ప్రముఖ నేతలు ఇప్పటికే హాస్పిటల్‌కు చేరుకున్నారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి భౌతికకాయం తరలించాలని భావిస్తున్నారు.
 
తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ పాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఆయన మరణవార్త తెలంగాణ సమాజాన్ని కలిచివేస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో సాయిచంద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణ వార్త ముఖ్యనేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ గొప్పతనాన్ని కీర్తిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పథకాలపై ఎన్నో పాటలను రాశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments